News March 27, 2025
ఏలూరు: సోషల్ పరీక్ష పై క్లారిటీ ఇచ్చిన డీఈవో

ఏలూరు జిల్లాలో నిర్వహించవలసిన సాంఘిక శాస్త్రం 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పై పలు అపోహలు విడాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ గురువారం అన్నారు. డీఈవో మాట్లాడుతూ.. రంజాన్ సెలవు మార్చి 31న ప్రభుత్వం ప్రకటిస్తే.. ఏప్రిల్ ఒకటిన షోషల్ పరీక్ష ఉంటుందన్నారు. ఒకవేళ ఏప్రిల్ 1న రంజాన్ సెలవు ప్రకటిస్తే.. మార్చి 31న సోషల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.
Similar News
News March 1, 2026
‘అబ్రహం లింకన్’ షిప్పై దాడి జరగలేదు: US

తమ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ‘అబ్రహం లింకన్’పై <<19274213>>దాడి<<>> జరిగిందన్న వార్తలను US సెంట్రల్ కమాండ్ ఖండించింది. దాడి చేశామని ఇరాన్ చెప్పిందంతా అబద్ధమని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘లింకన్ను ఏ మిస్సైల్ కూడా ఢీకొట్టలేదు. దాని దగ్గరగా కూడా చేరుకోలేదు. ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను తొలగించి అమెరికన్లను రక్షించేందుకు సెంట్రల్ కమాండ్తో కలిసి లింకన్ షిప్ విమానాలను ప్రయోగిస్తోంది’ అని స్పష్టం చేసింది.
News March 1, 2026
భారతీయులు ఆందోళన చెందాల్సిన పని లేదు: బండి

ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆయా దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు మస్కట్ వరకు రోడ్డు మార్గం గుండా చేరుకుని స్వదేశానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవచ్చన్నారు.
News March 1, 2026
ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.


