News March 27, 2025
వీడియో కాన్ఫరెన్స్లో మహబూబాబాద్ కలెక్టర్

హైదరాబాదు నుంచి సెర్ఫ్ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేశ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. యాసంగి మార్కెటింగ్ సీజన్లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకెపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50శాతానికి పెంచాలన్నారు.
Similar News
News December 31, 2025
మేడారం జాతరకు 12వేల మందితో బందోబస్తు: ఎస్పీ

మేడారం జాతరలో 12వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో 20 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తారని వెల్లడించారు. తొలిసారిగా డ్రోన్ కామాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 20 డ్రోన్లతో ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. 460 సీసీ కెమెరాలతో లైవ్ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.
News December 31, 2025
గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.
News December 31, 2025
2026 రిపబ్లిక్ పరేడ్.. చరిత్రలో తొలిసారి యానిమల్ కంటింజెంట్

2026 రిపబ్లిక్ డే పరేడ్లో కొత్తగా యానిమల్ కంటింజెంట్ ప్రదర్శన జరగనుంది. సైన్యంలోని రీమౌంట్ & వెటర్నరీ కార్ప్స్లో శిక్షణ తీసుకున్న జంతువులు కవాతు చేయనున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో బార్డర్ల వెంబడి భద్రతకు ఉపయోగించే 2 బాక్ట్రియన్ ఒంటెలు, 4 రాప్టార్లు, 10ఇండియన్ బ్రీడ్ ఆర్మీ, 6 కన్వెన్షనల్ మిలిటరీ డాగ్స్ ప్రదర్శనలో పాల్గొంటాయి. లద్దాక్కు చెందిన జన్స్కార్ పోనీలు కవాతు చేయనున్నాయి.


