News March 28, 2025
జగిత్యాల మార్కెట్ ధరల సమాచారం మీ కోసం

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,215, కనిష్ట ధర రూ. 1,918లుగా పలికాయి. అటు కందులు గరిష్ఠ ధర రూ. 6,495, కనిష్ఠ ధర రూ. 5,500, అనుములు రూ. 4896, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 11,000, కనిష్ఠ ధర రూ. 7,000, పసుపు గోళం గరిష్ఠ ధర రూ. 9,500, కనిష్ఠ ధర రూ. 5,000, వరి ధాన్యం (జైశ్రీరాం రకం) రూ. 2,311లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News November 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే
> బ్రిడ్జ్ నిర్మించాలని సీపీఎం నేతల ధర్నా
> విద్యార్థులతో వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే కడియం
> వరి పంటలను పరిశీలించిన కలెక్టర్
> బచ్చన్నపేట: డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
> జనగామలో డివైఎఫ్ఐ 46వ దినోత్సవ వేడుకలు
> కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
News November 7, 2025
నిడదవోలు: పీఎంజేవైలో 757 ఇల్లు మంజూరు

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత వాసులకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి ఎం. బుజ్జి తెలిపారు. ఆమె గురువారం నిడదవోలు మండలంలో క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పీఎంఏవై పథకం కొత్త మార్గదర్శకాలు విడుదలైనట్లు ఆమె పేర్కొన్నారు. నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలతో పాటు రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ గృహాలు అందుతాయని వెల్లడించారు.
News November 7, 2025
నవీన్ యాదవ్పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.


