News March 28, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,63,699 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,08,012, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,880, అన్నదానానికి రూ.10,807 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News March 3, 2026

నెల్లూరు రూరల్లో అనిల్ X గిరిధర్ రెడ్డి!

image

ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నా నెల్లూరు రూరల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. MLA తమ్ముడు గిరిధర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. YCP ఇన్‌ఛార్జ్‌గా ఆనం విజయ్ కుమార్ రెడ్డే పోటీలో ఉంటారని కాకాణి చెప్పినా.. అనిల్ యాదవ్ పేరు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతానికి అనిల్ నెల్లూరుకు అంటీముట్టనట్లు ఉన్నారు. రోజూ ప్రజల్లో తిరుగుతున్న గిరిధర్ రెడ్డిలో ఎవరు గెలుస్తారో మరి.

News March 3, 2026

మా బాడీని జూమ్ చేసి వీడియోలు తీయకండి: హీరోయిన్

image

నటీమణులను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీయడంపై ‘కాంతార’ నటి సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కళాకారులను అభ్యంతరకర యాంగిల్స్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు. ఫీమేల్ యాక్టర్స్ శరీర భాగాలను జూమ్ చేసి ఫొటోలు తీస్తూ వాటిని SMలో పోస్ట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి పనులు మానుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని ఆమె డిమాండ్ చేశారు.

News March 3, 2026

జడ్చర్ల మృతదేహం సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

image

రాష్ట్రవ్యాప్తంగా సంచలమైన సృష్టించిన జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.