News March 28, 2025
MBNR: రాజీవ్ యువ వికాసం రాయితీలు ఇలా.!

✓ యూనిట్ విలువను బట్టి రాయితీ మారుతుంది.
✓ రాయితీపోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు.
✓ యూనిట్ విలువ రూ.50 వేలలోపు ఉంటే.. ప్రభుత్వం 100% రాయితీ ఇస్తుంది.
✓ రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు ఉండే యూనిట్కు 90% రాయితీ ఉంటుంది.
✓ రూ.1,00,001 నుంచి రూ.2 లక్షలకు 80% రాయితీ ఇస్తారు.
✓ రూ.2L నుంచి రూ.4 లక్షలకు విలువ చేసే యూనిట్కు 70% రాయితీ లభిస్తుంది.
✓ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5.
Similar News
News November 2, 2025
డిప్యూటీ సీఎం పరిగి పర్యటన వాయిదా

పరిగి నియోజకవర్గంలో జరగాల్సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. ముందుగా సోమవారం జరగాల్సిన ఈ పర్యటన ఇప్పుడు బుధవారానికి జరుగనుంది. పరిగి పరిధిలో 400 KV, ఆరు 33/11 KV సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేసి, నజీరాబాద్ తండాలో 220 KV సబ్స్టేషన్ ప్రారంభించి, రూ.8 కోట్లు విలువైన వ్యవసాయ విద్యుత్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.
News November 2, 2025
అక్కయ్యపాలెంలో భార్యాభర్తలు సూసైడ్

విశాఖ ఫోర్త్ టౌన్ పరిధిలో ఆదివారం విషాదం నెలకొంది. అక్కయ్యపాలెం సంగం ఆఫీసు సమీపంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. మృతులు వాసు, అనితగా గుర్తించారు. అనిత ప్రస్తుతం ఏడో నెల గర్భిణిగా ఉందని సమాచారం. వారి మృతదేహాలను చూసి వాసు తల్లి సొమ్మసిల్లి పడిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.
News November 2, 2025
నదుల పక్కన ఇంటి నిర్మాణాలు చేయవచ్చా?

వాగులు, నదుల పక్కన ఇల్లు కట్టుకోవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. జల ప్రవాహాలు ఎక్కువైతే.. ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. ‘నీటి ఒత్తిడి వల్ల పునాదుల బలం తగ్గి, ఇంట్లో స్థిరత్వం లోపిస్తుంది. ప్రకృతి శక్తుల వైపరీత్యం నుంచి ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, వరుణ దేవుని ఆగ్రహానికి గురికావొద్దంటే ఈ స్థలాలను నివారించాలి. భద్రత కోసం వీటికి దూరంగా ఉండటం ఉత్తమం’ అని చెప్పారు. <<-se>>#Vasthu<<>>


