News March 28, 2025

సంగారెడ్డి: రూ.25 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి: కలెక్టర్

image

జిల్లాలో 2024-25 సంవత్సరానికి రూ.25 కోట్ల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులు చేపట్టినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎస్ఆర్ నిధులతో అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 2, 2025

కాలేజీల అనుమతికి హైపవర్ కమిటీ

image

AP: మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీల అనుమతికి ఇచ్చే ఈసీ జారీకి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, స్విమ్స్ డైరెక్టర్, వైద్యవిద్య డైరెక్టర్‌తో ఈ కమిటీ ఉండనుంది. ప్రైవేట్ రంగంలో ఏర్పాటయ్యే కాలేజీలకు ఈసీ జారీ, తనిఖీ కోసం ఈ కమిటీ పనిచేయనుంది.

News April 2, 2025

తిరుతి జిల్లాలో ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో 164 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 26,967 మందికి 26, 615 మంది పరీక్షలు రాశారు. ప్రైవేట్ విద్యార్థులు 127 మందికి గాను 41 మంది రాకపోవడంతో 86 మంది పరీక్షలు రాశారని డీఈవో కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు పూర్తి చేశారు.

News April 2, 2025

MDCL: ప్రభుత్వానికి బిగ్ THANKS: HCA

image

HYD ఉప్పల్ స్టేడియంలో ఉచిత పాసులు ఇవ్వకపోవడంపై SRHపై HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు ఒత్తిడి తెచ్చారని వచ్చిన వార్తల నేపథ్యంలో, ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టింది. దీనిపై స్పందించిన జగన్మోహన్ రావు ప్రభుత్వానికి X వేదికగా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. ప్రభుత్వ జోక్యం, SRH, అపెక్స్ కౌన్సిల్ కలిసి రాబోయే మ్యాచ్ సక్సెస్ కావడం కోసం చేపట్టిన చర్యలను అభినందించారు.

error: Content is protected !!