News March 28, 2025
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెన్నోబులేసు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా మాల్యావంతం పెన్నోబులేసును నియమించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
Similar News
News April 2, 2025
ATP: తాగునీటి సమస్య రాకుండా చూడాలి- కలెక్టర్

అనంతపురం జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చేతి పంపులు, పవర్ బోర్లు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి అన్ని విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025-26 కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు.
News April 1, 2025
ATP: మట్టి ఎత్తిన కలెక్టర్ వినోద్ కుమార్

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పశువుల నీటి తొట్టెకు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ చెలికతో మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా శంకుస్థాపనలో పాల్గొన్నారు. గ్రామస్థులు, కూటమి నాయకులు ఉన్నారు.
News April 1, 2025
అనంతపురం జిల్లాలో 7 కరవు మండలాలు.!

రబీ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో అనంతపురం జిల్లాలో మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాకిడి, విడపనకల్లు మండలాలకు స్థానం లభించింది. మిగతా మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.