News March 28, 2025
నాయుడుపేటలో బాలికపై అత్యాచారయత్నం.. ఐదేళ్లు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో వెంకయ్య అనే వ్యక్తికి నాయుడుపేట కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.22,000 జరిమానా విధించింది. నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక ఆడుకుంటుండగా 2019లో వెంకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అదే రోజు వెంకయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పొక్సో కోర్టు న్యాయమూర్తి సుమ నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష ఖరారు చేశారు.
Similar News
News November 11, 2025
ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <
News November 11, 2025
మెట్పల్లి: తండ్రిని హత్య చేసిన కుమారుడి అరెస్టు

మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఎల్లగంగ నరసయ్య(74)ను హత్య చేసిన ఆయన కుమారుడు ఎల్ల అన్వేష్(32)ను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. తండ్రి పెళ్లి చేయలేదని, ఏదైన పనిచేయమని ఒత్తిడి చేయడంతోనే హత్యకు పాల్పడినట్లు వివరించారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, మొబైల్ ఫోన్, ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
News November 11, 2025
జగిత్యాలలో 167 మందికి రూ.26.6లక్షల ఫ్యామిలీ బెనిఫిట్

జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అమలుపై అధికారులు సమీక్షించారు. జిల్లాలో మొత్తం 191 దరఖాస్తులు అందగా, 167 మంది లబ్ధిదారులకు రూ.26,60,000 ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలిపారు. మిగితా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కమిటీ సూచించింది.


