News March 28, 2025

విజయవాడ: అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులు న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(19) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేసి మోసం చేశాడు. విచారించిన న్యాయస్థానం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 30వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

Similar News

News December 2, 2025

NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nsic.co.in

News December 2, 2025

కృష్ణా: పోస్టాఫీసులో భారీ మోసం

image

ఉంగుటూరు పోస్టాఫీసులో నకిలీ స్టాంపులు, పాస్‌బుక్స్‌తో రూ.2 కోట్లకు పైగా ఖాతాదారుల డిపాజిట్లు మాయమైన ఘటన బయటపడింది. పోస్టుమాస్టర్ దేవేంద్రరావు, పోస్టుమాన్ శేఖర్ కలిసి ఏడాదిగా FDలు, సేవింగ్స్ రికార్డుల్లో భారీ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. సోమవారం ఓ మహిళ FD తీసుకోడానికి రాగా అసలు విషయం తెలిసింది. ఖాతాదారులు విచారణ కోరగా, అధికారలు పోస్టుమాస్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News December 2, 2025

సూర్యాపేట: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

image

తుంగతుర్తి మండలం గుడితండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ జయపాల్ నాయక్ వినూత్న రీతిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆస్తులు కంటే ఎక్కువ సంపాదిస్తే తన ఆస్తులన్నింటినీ గ్రామస్థులు జప్తు చేయొచ్చని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శక పాలన అందిస్తానన్నారు.తనను గెలిపించాలని కోరారు.ప్రస్తుతం ఈ బాండ్ పేపర్ SMలో వైరల్‌గా మారింది.