News March 25, 2024

ధరణిలో లోపాలుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది: పల్లా

image

TG: ధరణిలో లోపాలున్నాయని, వాటిని తాము గుర్తించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘4 నెలల క్రితం ధరణిలో లోపాలున్నాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు. చట్ట ప్రకారం రైతుల భూములు పట్టాలు చేయాలి. అద్భుతంగా నడిచిన ధరణిని కొనసాగించాలి. రైతుల ఉసురు పోసుకోవద్దు’ అని అన్నారు.

Similar News

News October 6, 2024

గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించలేను: ప్రియా భవానీ

image

గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదని హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ అన్నారు. తన శరీరాన్ని ఒక వస్తువుగా భావించనని చెప్పారు. ‘కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే నేను ఏ విషయంలోనూ బాధపడకూడదు. అందుకు అనుగుణంగా ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటా. అలాగే ఫ్యాషన్ పేరుతో కొన్నింటిని ప్రమోట్ చేయను’ అని ఆమె తెగేసి చెప్పారు. కాగా ప్రియా భవానీ ‘కళ్యాణం కమనీయం’, ‘రత్నం’ తదితర చిత్రాల్లో నటించారు.

News October 6, 2024

Air Indiaపై హాకీ క్రీడాకారిణి ఫైర్

image

విమాన‌యాన సంస్థ‌ల సిబ్బంది ప్ర‌యాణికుల ల‌గేజీపై ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారన్నది సామాన్యుల‌కు తెలిసిందే. ఈ అనుభవం ఇప్పుడు స్టార్ హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌కు ఎదురైంది. ఇటీవ‌ల అమె Air India విమానంలో కెనాడా నుంచి ఢిల్లీ వ‌చ్చారు. అయితే, ఆమె లగేజీ ధ్వంసమ‌వ్వ‌డంపై మండిపడ్డారు. ‘మీ అద్భుతమైన బ‌హుమానానికి ధ‌న్య‌వాదాలు. మీ సిబ్బంది మా బ్యాగ్‌లను ఇలా చూస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 6, 2024

CM చంద్రబాబును కలిసిన మాజీ CM

image

AP: మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు ఇరువురూ చర్చించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కిరణ్ కలిశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.