News March 28, 2025

NGKL: అనాథ బాలికల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాత్సల్య అనాధ బాలికల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సబిత గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనాథ వసతిగృహంలో గదులను పరిశీలించారు. అందులో నివసిస్తున్న బాలికలకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. డోనర్స్ అందించిన వస్తువులను బాలికలకు అందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాష్ రూమ్‌లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Similar News

News January 18, 2026

జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

image

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

News January 18, 2026

ముగిసిన సెలవులు.. గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో గుంటూరులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రధాన నగరాలకు వెళ్లే బస్సు, రైలు టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుంటూరు నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 18, 2026

జాతీయ స్థాయి కబడ్డీకి పాలమూరు విద్యార్థినులు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అండర్-19 విభాగంలో జిల్లాకు చెందిన శివాని, భవాని, మౌనిక జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో రేపటి నుంచి జరిగే ఈ టోర్నీలో వీరు పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాలమూరు క్రీడామణులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.