News March 28, 2025
MHBD: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన MHBD ఈదులపూసపల్లి శివారు శీతల తండా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈర్య తండాకు చెందిన బానోత్ రవి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని తెలిపారు.
Similar News
News January 5, 2026
సింగూరు ప్రాజెక్టులో 20 లక్షల చేప పిల్లల విడుదల

సింగూరు ప్రాజెక్టులో మత్స్యకారుల ఉపాధి కోసం 20 లక్షలు చేప పిల్లలను వదలనున్నట్లు మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఆర్ఎల్. మదుసూదన్ తెలిపారు. సోమవారం సింగూరు ప్రాజెక్టులో ఈ ఏడాదికి మొదటి విడతగా 2.70 లక్షలు చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. దఫాలు, దఫాలుగా ప్రాజెక్టులో మొత్తం 20 లక్షల చేప పిల్లలను వదలనున్నామన్నారు. చేప పిల్లలు పెరిగి పెద్దయ్యాక మత్స్యకారులు ఉపాధి పొందవచ్చన్నారు.
News January 5, 2026
తిరుపతి: 5 ఏళ్ల జైలు శిక్ష.. ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫైన్

2018లో ఎర్రవారి పాలెంలో నమోదైన కేసులో నలుగురు స్మగ్లర్లకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి కోర్టు తీర్పునిచ్చింది. జిల్లా SP సుబ్బరాయుడు ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ విధానం వల్ల సరైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడింది. అడవుల సంపదను దోచుకునే వారిపై రాజీలేని పోరాటం చేస్తామని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
News January 5, 2026
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వీడాలి: ఇన్ఛార్జ్ కలెక్టర్

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.


