News March 28, 2025
HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపుల్లోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్లో ఇవన్నీ ఉండవు. నాసీరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాల్లో నీటిని తెచ్చుకోవాలి.
Similar News
News January 13, 2026
HYD: నేడు ఆకాశంలో అద్భుతాలు..!

నేడు HYD దద్దరిల్లనుంది. ఆకాశంలో రోజంతా అద్భుతాలు చూడొచ్చు.
☛ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 3 డేస్ కైట్& స్వీట్ ఫెస్టివల్
☛ 3డేస్ పరేడ్ గ్రౌండ్లో సా.5 నుంచి రాత్రి వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్
☛ గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్
వీటికోసం రాష్ట్ర పర్యాటకశాఖ సర్వం సిద్ధం చేసినట్లుగా వెల్లడించింది.
News January 13, 2026
HYD: స్మోకింగ్ చేయకపోయినా క్యాన్సర్

MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్, సర్విక్స్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు స్మోకింగ్ చేసేవారికే వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు తాగనివారి జీవితాలనూ కబళిస్తోంది. HYDలో మహిళల్లో, ముఖ్యంగా స్మోకింగ్ అలవాటులేనివారిలోనూ కేసులు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం, ఇరుకు కిచెన్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, చెత్త దహనం, ధూళి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
News January 13, 2026
HYD: హైడ్రా వారి జోలికి వెళ్లదు..!

నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని మరోసారి స్పష్టం చేసింది. 2024 జులైలో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్లను తొలగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నిబంధన అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పేర్కొంది. చట్టం ప్రకారం హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొంది. నిన్న హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులు అందాయి.


