News March 28, 2025

గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

image

జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. పరిసర ప్రాంతాల, కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Similar News

News October 31, 2025

ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

image

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.

News October 31, 2025

సత్యసాయి శత జయంతి: ఆరుగురు మంత్రులతో కమిటీ

image

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం, ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మంత్రి అనగాని సత్యప్రసాద్, సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, సవిత, ఆనం రామనారాయణ రెడ్డి నియమితులయ్యారు. కమిటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు MLA పల్లె సింధూర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

News October 31, 2025

ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

image

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.