News March 28, 2025

VJA: యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

image

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.

Similar News

News January 8, 2026

యూరియా తీసుకున్న రైతులపై నిఘా

image

TG: ఒకేసారి 40-50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 4 జిల్లాల్లో అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి రావడంతో క్షేత్రస్థాయి విచారణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. రైతుల భూమి విస్తీర్ణం, పంటలు, యూరియా అవసరం, వినియోగాన్ని పరిశీలించనున్నాయి.

News January 8, 2026

మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

image

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

నెల్లూరు రూపు రేఖలు మారేనా..?

image

నెల్లూరులో త్వరలో 84KM మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. NH-16, బుచ్చి హైవే, మినీబైపాస్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, ముత్తుకూరు రోడ్డు తదితర ప్రాంతాలు అనుసంధానం కానున్నాయి. ట్రాఫిక్ సమస్య తీరనుంది. కృష్ణపట్నం పోర్టుతో పాటు పలు పరిశ్రమలకు భారీ వాహనాల రాకపోకలు సులభంగా జరగనున్నాయి. దూరాభారాలు తగ్గనున్నాయి. లేబూరు బిట్-2 నుంచి రాజుపాలెం వరకు రింగ్ రోడ్డు రానుండగా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది.