News March 28, 2025
వనపర్తి: గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని వినతి

బంజారా గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంఘాల నేతలు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు వినతిపత్రం ఇచ్చారు. వనపర్తి జిల్లా వాసి, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పదవి విషయంలో కేసీ వేణుగోపాల్తో చర్చించామన్నారు. తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని చెప్పామన్నారు.
Similar News
News April 2, 2025
నాగర్కర్నూల్: GREAT.. 3 GOVT జాబ్స్ కొట్టింది..!

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలానికి చెందిన మద్దెల శైలజ సత్తా చాటింది. కృషి, పట్టుదలతో గ్రూప్-2, 3, 4 పరీక్షల్లో విజయాన్ని సాధించింది. ప్రజాసేవ తన లక్ష్యమని పేర్కొన్న శైలజ, సివిల్స్ వైపు అడుగులు వేస్తానని తెలిపింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించానని పేర్కొన్న శైలజను, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆమె మహిళలకు, నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలిచారని పలువురు అభినందించారు.
News April 2, 2025
నారాయణపేట: GOVT జాబ్స్ కొట్టారు.. సజ్జనర్ అభినందనలు

నారాయణపేట డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ కూతురు వీణ 118 ర్యాంకును, టీఐ-2గా పనిచేస్తున్న వాహిద్ కూతురు ఫహిమీనా ఫైజ్ 126 ర్యాంకు సాధించడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనర్ ఆ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల కుమార్తెలు గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం అభినందనీయమని కొనియాడారు.
News April 2, 2025
వరంగల్: GREAT.. గ్రూప్-1 ఆఫీసర్గా వాచ్మెన్ కుమారుడు

వరంగల్ జిల్లాకు చెందిన వాచ్మెన్ కుమారుడు గ్రూప్-1 ఆఫీసర్గా ఎంపికయ్యాడు. మామునూరుకు చెందిన జయ-రవికుమార్ దంపతుల కుమారుడు రాహుల్ ఇటీవల TGPSC విడుదల చేసిన గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 555వ ర్యాంక్, మల్టీ జోన్-1 SC కేటగిరీలో 23వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 2023-2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏవో, జేఏఓ ఎగ్జామ్లో రాహుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ)గా ఎన్నికయ్యారు.