News March 28, 2025

HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

image

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.

Similar News

News April 2, 2025

SRD: ఒక్కో పీఎంశ్రీ పాఠశాలకు రూ. 50 వేలు: DEO

image

పీఎంశ్రీ పాఠశాలల వార్షికోత్సవం కోసం రూ.50 వేల చొప్పున నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. జిల్లాలోని 44 పాఠశాలలకు రూ. 22 లక్షల నిధులను కేటాయించినట్లు చెప్పారు. నిధులు నేరుగా ఆయా పాఠశాల ఖాతాలో జమ అవుతాయని పేర్కొన్నారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.

News April 2, 2025

నాగర్‌కర్నూల్: GREAT.. 3 GOVT జాబ్స్ కొట్టింది..!

image

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలానికి చెందిన మద్దెల శైలజ సత్తా చాటింది. కృషి, పట్టుదలతో గ్రూప్-2, 3, 4 పరీక్షల్లో విజయాన్ని సాధించింది. ప్రజాసేవ తన లక్ష్యమని పేర్కొన్న శైలజ, సివిల్స్ వైపు అడుగులు వేస్తానని తెలిపింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించానని పేర్కొన్న శైలజను, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆమె మహిళలకు, నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలిచారని పలువురు అభినందించారు.

News April 2, 2025

నారాయణపేట: GOVT జాబ్స్ కొట్టారు.. సజ్జనర్ అభినందనలు

image

నారాయణపేట డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ కూతురు వీణ 118 ర్యాంకును, టీఐ-2గా పనిచేస్తున్న వాహిద్ కూతురు ఫహిమీనా ఫైజ్ 126 ర్యాంకు సాధించడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనర్ ఆ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల కుమార్తెలు గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం అభినందనీయమని కొనియాడారు. 

error: Content is protected !!