News March 28, 2025

HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

image

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.

Similar News

News November 13, 2025

నిజామాబాద్, కామారెడ్డి పోలీసుల WARNING

image

అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారితోపాటు ఆడపిల్లలను వేధించే వారిపై నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక షీటీమ్‌లతో ఎక్కడికక్కడ నిఘా ఉందని, అమ్మాయిల జోలికి ఎవరైనా వెళితే తాట తీస్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని చెప్పారు. SHARE IT

News November 13, 2025

జూబ్లీబైపోల్: డివిజన్ల వారీగా ఓటింగ్ వివరాలు

image

1.షేక్‌పేట్ ఓటర్లు 71,062, పోలైన ఓట్లు 31,182(43.87%)
2.రహమత్‌నగర్ ఓటర్లు 74,387 పోలైన ఓట్లు 40,610(54.59%)
3.యూసుఫ్‌గూడ ఓటర్లు 55,705, పోలైన ఓట్లు 24219(43.47%)
4.ఎర్రగడ్డ ఓటర్లు 58,752, పోలైన ఓట్లు 29,112(49.55)
5.బోరబండ ఓటర్లు 53,211, పోలైనవి 29,760 (55.92%)
6.వెంగళ్‌రావునగర్ ఓటర్లు 53,595, పోలైన ఓట్లు 25,195(47.00%)
7.సోమాజిగూడ(PART) ఓటర్లు 34,653, పోలైన ఓట్లు14,553( 41.99%)

News November 13, 2025

మేడారం.. రాజకీయ విమర్శలకు కేంద్రం..!

image

ఎవ్వరికి ఎవ్వరు తగ్గడం లేదు. దగ్గరలో ఎన్నికలేవీ లేకున్నా ములుగు జిల్లాలో రాజకీయం సలసల కాగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇందుకు మేడారం కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనదేవతల గద్దెల విస్తరణ, అభివృద్ధి పనులను నాసిరకం, నిర్లక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేత నాగజ్యోతి ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి సీతక్క ‘చిల్లర విమర్శలు’ అంటూ నిన్న గట్టిగా తిప్పికొట్టారు.