News March 28, 2025
మా జట్టు ఓపెనర్లపై ఆధారపడలేదు: క్లాసెన్

తమ జట్టు ఓపెనర్లపై ఆధారపడదని SRH బ్యాటర్ క్లాసెన్ తెలిపారు. ‘హెడ్, అభిషేక్ మాకు అదిరిపోయే ఆరంభాల్ని ఇస్తున్నారు. అలా అని మేం వారిపైనే ఆధారపడలేదు. మా లైనప్ చూడండి. 8వ నంబర్ బ్యాటర్ వరకూ విధ్వంసకరంగానే ఆడతారు. కాబట్టి ఓపెనర్లు ఎలా ఆడినా సమస్య లేదు. మేం ఆడేదే రిస్కీ ఆట. నిన్నటి మ్యాచ్లో ఒకట్రెండు వికెట్లు దురదృష్టవశాత్తూ కోల్పోయాం. లేదంటే ఆ పిచ్పై కనీసం 220 స్కోర్ చేయాల్సింది’ అని వివరించారు.
Similar News
News April 2, 2025
టాప్-2లోకి దూసుకొచ్చిన PBKS

LSGపై ఘన విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకొచ్చింది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాప్లో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. కాగా ఈ మూడు జట్లు ఇప్పటివరకూ కప్ కొట్టకపోవడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో GT, MI, LSG, CSK, SRH, RR, KKR ఉన్నాయి.
News April 2, 2025
రిషభ్ పంత్కు పంజాబ్ కింగ్స్ కౌంటర్

మెగా వేలం సమయంలో తమ ఫ్రాంచైజీని అవమానించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్పై PBKS కౌంటర్ ఇచ్చింది. రాత్రి LSGపై మ్యాచ్ గెలిచిన తర్వాత ‘మెగా వేలం టెన్షన్ దానంతటదే ముగిసింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కాగా వేలం అనంతరం పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వేలంలో పంజాబ్ నన్ను ఎక్కడ కొంటుందో అని టెన్షన్ పడ్డా. శ్రేయస్ అయ్యర్ను దక్కించుకోవడంతో లక్నో టీమ్లో చేరగలనని భావించా’ అంటూ చెప్పుకొచ్చారు.
News April 2, 2025
నేడు ప్రకాశం జిల్లాకు అనంత్ అంబానీ

AP: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం సమీపంలో రూ.375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కు ఆయన భూమిపూజ చేస్తారు. ఆయనతోపాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.