News March 25, 2024
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై తెరపడని ఉత్కంఠ!
కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. రోజుకో పేరును తెరపైకి వస్తుండడం.. అధిష్ఠానం ఎవరి పేరునూ ఖరారు చేయకపోవడంతో నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అభ్యర్థి ఎంపిక ప్రహసనంగా మారడంతో పార్టీలో చర్చకు దారి తీసింది. సీటు కోసం ఎవరికివారు అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
Similar News
News September 29, 2024
తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖి
తెలంగాణలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఈరోజు 33 జిల్లాల తహశీల్దార్లతో మంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని మంత్రి పొంగులేటి చెప్పారు.
News September 29, 2024
HYDలో మధిర మండల వాసి మృతి
మధిర మండలం రాయపట్నంకి చెందిన కంపసాటి కొండ హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోర్టు కేసులో జామీను కోసం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతణ్ని హైదరాబాదుకు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహజ మరణమా లేదా ఇతర కారణమా తెలియాల్సి ఉంది.
News September 29, 2024
పంచాయతీ ఎన్నికలు.. మహిళా ఓటర్లు ఎంతమందంటే.
ఖమ్మం జిల్లాలో మహిళా ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. . ఖమ్మం (R) 40,807, తిరుమలాయపాలెం 25,705, కూసుమంచి 25,528, నేలకొండపల్లి 25,633,ముదిగొండ 25,026, రఘునాథపాలెం 20,954, కొణిజర్ల 21,176, వైరా13,909, చింతకాని 21,340, ఏన్కూర్ 14,340, కల్లూరు 27,473,తల్లాడ 23,336, పెనుబల్లి 22,086,సత్తుపల్లి 18,329, మధిర 16,084, బోనకల్ 18,455, ఎర్రుపాలెం 20,407,వేంసూరు 18,579, కామేపల్లి 17,779, సింగరేణి 22,862.