News March 28, 2025

కుత్బుల్లాపూర్: గమ్యం చూపని RTC గమ్యం యాప్..!

image

చిటికెలో ఆర్టీసీ బస్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఆర్టీసీ గమ్యం యాప్ రూపొందించింది. యాప్ అందుబాటులోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించలేక పోతోంది. కుత్బుల్లాపూర్, అల్వాల్ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు బస్ ట్రాకింగ్ కోసం యాప్ ఉపయోగించగా సరైన సమాచారం అందించడం లేదని, మెరుగుపరచాలని కోరారు. అయితే అన్ని బస్సులకు ట్రాకింగ్ సిస్టం లేదని తెలుస్తోంది.

Similar News

News January 16, 2026

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్.. సీక్రెట్ చెప్పిన సోనూ సూద్

image

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు నటుడు సోనూ సూద్. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఏంటో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లేవగానే గోరువెచ్చని నీరు తాగుతానని, అనంతరం రోజూ గంటపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, ఇతర వర్కౌట్స్‌తో పాటు ధ్యానం చేస్తానని తెలిపారు. పెద్దగా డైట్ ఫాలో అవ్వనని, హోమ్ ఫుడ్‌ని లిమిటెడ్‌గా తీసుకుంటానని వెల్లడించారు. ఇక షూటింగ్‌లలో ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటానని అన్నారు.

News January 16, 2026

ఖమ్మం: పులిగుండాల చెంత.. పక్షుల కిలకిలరావాలు!

image

ప్రకృతి ఒడిలో పక్షుల విన్యాసాలను తిలకించేందుకు ‘బర్డింగ్ భారత్’ ఖమ్మం చాప్టర్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. జనవరి 18న పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద ‘బర్డ్ వాక్’ నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు సాగే ఈ నడకలో పక్షుల జీవవైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల వారు రూ. 250 ఫీజు చెల్లించి ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 16, 2026

ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

image

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.