News March 28, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు

image

ఏపీలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి నలుగురికి అవకాశం వరించింది. వారిలో నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అంగజాల గీత, పత్తికొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నబి సాహెబ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కురువ మల్లయ్య ఉన్నారు.

Similar News

News January 15, 2026

విజయ్ దేవరకొండ.. మీసాలు మెలేసి ట్రెడిషనల్ లుక్‌లో..

image

సినీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెలేసిన మీసాలు, కళ్లద్దాలతో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలను విలేజ్‌లో జరుపుకుందామని తన తల్లికి ప్రామిస్ చేశానన్నారు. విజయ్ ప్రస్తుతం <<18643470>>’రౌడీ జనార్ధన’<<>>తో పాటు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు.

News January 15, 2026

ఆదిలాబాద్: పురపోరు.. MPTC ప్రచారం జోరు..!

image

పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం జోరందుకుంటోంది. అదే ఊపుతో పల్లెలోనూ ఎంపీటీసీ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మామడ మండలంలోని మొండిగుట్ట, తదితర గ్రామాల్లో యువకులు పార్టీలకతీతంగా ఒక అభ్యర్థిని ప్రకటించి తనకు సహకరించండి అని పల్లెల్లో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులు ఇదేం కర్మరా బాబు అని అంటున్నారట.

News January 15, 2026

BISAG-Nలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

image

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్‌(BISAG-N)లో 6 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్( కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్(అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్) అర్హత కలిగిన వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/