News March 28, 2025

సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 విద్యార్థులు పరీక్ష రాశారు. 14 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదని తెలిపారు.

Similar News

News January 16, 2026

20న BJPకి కొత్త బాస్.. నితిన్ నబీన్ ఎన్నిక లాంఛనమే!

image

BJP నూతన జాతీయాధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 19న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అదే రోజు పత్రాల పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అవసరమైతే 20న ఓటింగ్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ వేసే అవకాశం ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనమే!

News January 16, 2026

పట్టుచీర కట్టిన తర్వాత..

image

* చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేస్తే సరిపోతుంది. * చీరలను కట్టిన వెంటనే కాకుండా నాలుగైదు సార్లు కట్టిన తర్వాత డ్రై క్లీనింగ్‌కి ఇస్తే సరిపోతుంది. * కొత్త చీరలను డిటర్జెంట్ పౌడర్, షాంపూలతో వాష్ చేస్తారు. అలాంటప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని ఎంచుకోవాలి. * ఎంబ్రాయిడరీ, ఇతర వర్కులు ఉన్న హెవీ చీరలను చేత్తోనే ఉతకడం మంచిది. * రెండు, మూడు చీరలు ఉతకాల్సి వచ్చినపుడు వేటికవే విడిగా ఉతకాలి.

News January 16, 2026

SRPT: కలెక్టరేట్‌లో మున్సిపల్ వార్డుల వారిగా డ్రా

image

మున్సిపల్ CDMA ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ఈ నెల 17న కలెక్టర్ సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్‌ల డ్రా తీయనున్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలమైన రిజర్వేషన్ రావాలని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గతంలో గెలిచిన వారితో పాటు, ఈసారి కొత్తగా పోటీ చేయాలనుకునే వారు కూడా ఈ డ్రా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.