News March 28, 2025
రూ.165 లక్షలతో ఆరోగ్య సేవల మెరుగు..IOCL

ఇండియన్ ఆయిల్ TAPSO HYDలో ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు 3 ఒప్పందాలు కుదుర్చుకుని రూ.165 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ నిధులతో స్వీకార్ అకాడమీలో ఆటిజం బాధిత పిల్లలకు ప్రత్యేక సంరక్షణ, కోఠిలో ప్రభుత్వ ENT ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి అవసరమైన పరికరాలు, మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
Similar News
News September 18, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా బాధ్యతలు.. CM రేవంత్ను కలిసిన NVS రెడ్డి
* SEP 21న చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ ఆడనున్న కల్వకుంట్ల కవిత
* HYDలో భారీ వర్షం.. GHMC, హైడ్రా, పోలీస్, విద్యుత్ విభాగాలు సమన్వయం చేసుకోవాలన్న మంత్రి పొన్నం
* మూసీకి వరద.. అంబర్పేట్-మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
* SEP 21-30 వరకు జరిగే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలి: మంత్రి జూపల్లి
News September 18, 2025
నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (MSP) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 18, 2025
వేలూరు సీఎంసీలో ఎన్టీఆర్ వైద్య సేవ లేనట్లేనా..?

చిత్తూరు జిల్లా నిరుపేదలు చాలామంది వేలూరు CMC ఆసుపత్రికి వెళ్తుంటారు. క్రిటికల్ కేర్, యాక్సిడెంట్స్, ఇతర ఏ సమస్యలు వచ్చిన ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఈ ఆసుపత్రే. ఇది తమిళనాడులో ఉండటంతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు కావడం లేదు. రూ.లక్షల్లో బిల్లులతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది.