News March 28, 2025
HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.
Similar News
News January 13, 2026
నిమ్మకు డ్రిప్ విధానంలో నీరు అందిస్తే మేలు

నిమ్మలో పూత, పిందె, పండు అభివృద్ధి దశలో తప్పనిసరిగా నీరు అందించకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మ తోటలకు డ్రిప్ ద్వారా నీరు అందించడం మంచిదంటున్నారు నిపుణులు. దీని వల్ల 14-25% వరకు నీరు ఆదా అవడంతో పాటు కలుపు 30% తగ్గుతుంది. నీటిలో తేమ ఎక్కువ రోజులుండి కాయ నాణ్యత, దిగుబడి పెరిగి తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. ఎరువులను కూడా డ్రిప్ విధానంలో అందించవచ్చు. దీని వల్ల కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు.
News January 13, 2026
భారీ జీతంతో 260 పోస్టులకు నోటిఫికేషన్

షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 24 -FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1.25L చెల్లిస్తారు. * మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 13, 2026
KNR: పేపర్ లీక్.. 30 మంది ఏఈఓల సస్పెండ్

అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడి దొరికిపోయిన 30 మంది ఇన్ సర్వీస్ ఏఈఓలను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసి లీకేజీకి కారణమైన 30 మందితోపాటు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 8 మంది, సిరిసిల్లలో ముగ్గురు, మిగతా వారు వరంగల్, అశ్వారావు పేట, రాజేంద్రనగర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.


