News March 28, 2025
VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 24, 2026
థాయ్లాండ్లో కొత్త వైరస్.. జూపార్క్లో ‘బయో- బబుల్’

‘థాయ్లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.
News February 24, 2026
జగిత్యాల: ఎస్సారెస్పీ కెనాల్లో దూకి మహిళ ఆత్మహత్య

జగిత్యాల మండలం ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన అనూష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనూష కుటుంబం గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఈరోజు ఉదయం విజయవాడ నుంచి వచ్చిన కొందరితో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో, అవమాన భారంతో అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
News February 24, 2026
PDPL: ఇంటర్ పరీక్షల్లో ఆ నిబంధన తొలగింపు!

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ‘నిమిషం ఆలస్యం’ నిబంధనను బోర్డు ఎత్తివేసిందని జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో 10,367 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు.


