News March 25, 2024
కవితకు బెయిల్ రాకపోతే తీహార్ జైలుకే?

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఉదయం 11 గంటలకు ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే కవితకు రేపు కూడా బెయిల్ రాకపోతే ఆమెను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత లాయర్లు ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ ఆమెను కలిశారు.
Similar News
News March 16, 2026
చంద్రబాబు, లోకేశ్ తప్పకుండా అనుభవిస్తారు: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని MLA పెద్దిరెడ్డి అన్నారు. నెల్లూరు జైలులో పిన్నెల్లిని ఇవాళ MP మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ‘YCP నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. హత్య కేసులో అసలైన నేరస్థులను వదిలి పిన్నెల్లిపై అక్రమ కేసు మోపారు. దీనికి ప్రతిఫలం CBN, లోకేశ్ అనుభవిస్తారు’ అని పెద్దిరెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదని YCP హయాంలో ఇలాంటి చర్యలే రిపీట్ అయితే సహించగలరా అని MP ప్రశ్నించారు.
News March 16, 2026
రోహిత్ రెడ్డి ఆహ్వానంతోనే పార్టీకి వచ్చారు: FIR

TG: మొయినాబాద్ <<19386155>>కేసులో<<>> మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆహ్వానంతోనే నిందితులు పార్టీకి వచ్చినట్లు FIRలో వెల్లడైంది. 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, సిమ్లాలో కొకైన్ కొన్నట్టు నిందితుడు కౌశిక్ అంగీకరించినట్లు పేర్కొంది. పోలీసులమని చెప్పినా షూట్ చేశారని.. రోహిత్ రెడ్డి సోదరుడైన రితేశ్ రెడ్డి పేరున ఉన్న ఆ గన్ను సీజ్ చేసినట్లు పేర్కొంది.
News March 16, 2026
దేశంపై యుద్ధ ప్రభావం పడకుండా మోదీ చర్యలు: చంద్రబాబు

AP: యుద్ధ ప్రభావంతో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్కు ఇబ్బందులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా PM మోదీ చర్యలు చేపడుతున్నారు. కష్టకాలంలో కుంగిపోకుండా సమష్టిగా పనిచేయాలి. అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను గుర్తు తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి’ అని అమరావతిలో అమరజీవి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.


