News March 28, 2025
NGKL జిల్లాలో 28 మంది విద్యార్థులు గైర్హాజరు: డీఈవో

జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ పరీక్ష కేంద్రాలను తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 60 కేంద్రాల్లో 10,584 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 10,556 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని అని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
Similar News
News November 7, 2025
ORRకు NTR జిల్లాలో భూసేకరణ పూర్తి.. ఆ మండలాల మీదుగానే.!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి NTR జిల్లాలో భూసేకరణ పూర్తి చేశారు. మైలవరం, G.కొండూరు, వీరులపాడు, కంచికచర్ల మండలాల పరిధిలో 18 గ్రామాల మీదుగా సుమారు 51 K.M పరిధిలో ORR నిర్మాణం కానుంది. జిల్లాలో 3,300 ఎకరాల భూమిని సేకరించి వాటి వివరాలు NH అధికారులకు అధికారులు పంపారు. త్వరలో సేకరించనున్న భూముల వివరాలు, కంపెన్సేషన్ తెలుపుతూ గెజిట్ విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
News November 7, 2025
NZB జిల్లాలో రేపటి నుంచి 163 సెక్షన్

TGPSC నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద రేపటి నుంచి 14వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163ను అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రం వద్ద తిరగవద్దని ఆయన సూచించారు.
News November 7, 2025
సచివాలయాల పేరును మార్చలేదు: CMO

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.


