News March 28, 2025

పల్నాడు: సైన్స్ పరీక్షలకు 98.70 శాతం హాజరు

image

పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు 98.70 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 128 సెంటర్లలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. మొత్తం 25,690 మంది విద్యార్థులకు గాను పరీక్షలకు 25,347 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు, 13 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు పరీక్షలను పర్యవేక్షించారని డీఈవో చెప్పారు. 

Similar News

News February 26, 2026

ADB: 369 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ జాదవ్ గణేష్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మొత్తం 8,549 మంది విద్యార్థులకు గాను 8,180 మంది హాజరయ్యారని, 369 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

News February 26, 2026

‘వెలుగుమట్ల’ భూముల వివాదం.. హిస్టరీ ఇదే

image

TG: 1950sలో ఆచార్య వినోబా భావే ఆశయాలకు ఆకర్షితులైన రాయల కోటేశ్వరరావు అనే భూస్వామి ఖమ్మం(D) వెలుగుమట్లలో 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు అప్పగించారు. కాలక్రమంలో విలువ పెరగడంతో అక్రమార్కులు తప్పుడు పత్రాలతో ఆ భూమి అమ్మారు. సొంతింటి కలతో సామాన్యులు కొని ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్టే విధించింది. దీంతో అధికారులు <<19224009>>నిర్మాణాలను<<>> తొలగిస్తున్నారు.

News February 26, 2026

కామారెడ్డి: 145 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 7,878 మంది విద్యార్థులకు గాను 7,733 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 98.16 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.