News March 28, 2025
బంగారు కవచాలతో భద్రాద్రి రామయ్య దర్శనం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం సందర్భంగా బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారికి విశేషాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి బేడా మండపంలో సంధ్యా హారతులు, ఉత్సవాన్ని జరపనున్నారు. ఈ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తిలకించారు.
Similar News
News September 17, 2025
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సంచిలో మహిళ డెడ్బాడీ

చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2025
అనకాపల్లి: రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

అనకాపల్లి జిల్లాలో రాబోయే ఐదు రోజులు మేఘావృత వాతావరణం నెలకొని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్ఆర్ఎస్ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారి ముకుందరావు తెలిపారు. మంగళవారం జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News September 17, 2025
విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.