News March 25, 2024
శ్రీకాకుళం: రూ.రెండు లక్షల నగదు, కారు సీజ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711374480008-normal-WIFI.webp)
సరుబుజ్జిలి మండలం అమృతలింగానగరం వద్ద కారులో తరలిస్తున్న రెండు లక్షల రూపాయల నగదు, కారును సీజ్ చేసినట్లు ఎస్సై బి.నిహార్ తెలిపారు. బూర్జ, సరుబుజ్జిలి మండలాలకు సంబంధించిన 2024 సాధారణ ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్ -1 సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా హిరమండలానికి చెందిన రత్నాల రమ మోహనరావు బిల్లులు లేకుండా తరలిస్తున్న సొమ్మును పట్టుకున్నట్లు ఎస్సై చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News July 5, 2024
శ్రీకాకుళం: జాబ్ మేళా.. 16 మంది ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720179060125-normal-WIFI.webp)
శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.
News July 5, 2024
శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720170463987-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
News July 5, 2024
శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720169676712-normal-WIFI.webp)
అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.