News March 29, 2025

ఏలూరు: ఏప్రిల్ 1న సోషల్ పరీక్ష..డీఈవో 

image

జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో సోషల్ పరీక్ష పై నేటి వరకు సందిగ్ధత నెలకొంది. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్చి 31న జరగాల్సిన సోషల్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. దీనికి అనుకూలంగా యాజమాన్య సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్లు సిద్ధపడాలని ఆమె సూచించారు.

Similar News

News November 3, 2025

కుంకుమాది తైలంతో చర్మ సంరక్షణ

image

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్‌లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.

News November 3, 2025

మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.

News November 3, 2025

చిరకాల విజయం తర్వాత కాబోయే భర్తతో స్మృతి

image

ప్రపంచకప్ విజయం తర్వాత భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన కాబోయే భర్త, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి కప్పును పట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈనెలలోనే వీరిద్దరూ <<18043744>>పెళ్లి<<>> చేసుకోనున్నారు. కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని సాధించిన ఈ సంతోష క్షణాన్ని ప్రియమైన వ్యక్తితో పంచుకోవడం అద్భుతంగా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.