News March 29, 2025
ఒంగోలు: ‘విద్యుత్ సర్ ఛార్జీలను రద్దు చేయాలి’

ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే. మాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలపై భారాలు మోపడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
ఒంగోలులో ఇలా చేస్తున్నారా..?

ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు తాలుకా PS పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేయగా.. బహిరంగంగా మద్యం తాగుతూ ముగ్గురు పట్టుబడ్డారు. ఇలాగే బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News April 2, 2025
దివావకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన సాగేదిలా

పెదచెర్లపల్లి మండలం దివాకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 7:15 నిమిషాలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. 9:15కు దివాకరపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9: 25 నిమిషాలకు బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45 వరకు సభలో పాల్గొంటారు. 11:55 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు.
News April 1, 2025
ప్రకాశం: పింఛన్ నగదు మాయం

పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.