News March 25, 2024

రెంటచింతల: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తరలి వ్యక్తి మృతి చెందిన ఘటన రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంట మణికంఠ రెడ్డి (32) తన ఇంటి ఎదురుగా ఉన్న విద్యుత్ మోటారు పట్టుకోగా షాక్ తగిలి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News March 13, 2026

గుంటూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 14న ఉదయం 10 గంటల నుంచి జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులు, కుటుంబ, వివాహ సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

News March 13, 2026

GNT: గ్యాస్ వినియోగదారులకు హెల్ప్ లైన్ నెంబర్

image

గుంటూరు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ 8309160972, 6309520569 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.

News March 13, 2026

ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు: గుంటూరు DEO

image

వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నెల 16 నుంచి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట నిర్వహించాలని DEOసలీం భాష సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి 12.30ని.ల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని అన్నారు.