News March 29, 2025
ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్

ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్సై శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈనెల 30, 31 తేదీలలో నందలూరు రైల్వే కేంద్రంలోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్యాలయంలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు ఈనెల 29లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 4, 2025
సిరిసిల్ల: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ యువతకు అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ (TGMBCDC) HYD ఆధ్వర్యంలో వివిధ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tgomms.cgg.gov.in వెబ్సైట్ను చూడవచ్చన్నారు.
News July 4, 2025
అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. నోటీసులు ఇచ్చే అవకాశం?

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్&రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారేనని ఇటీవల అనిరుధ్ <<16911067>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.
News July 4, 2025
నిర్మల్ కలెక్టరేట్లో ఘనంగా రోశయ్య జయంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డా.కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.