News March 29, 2025

నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

image

మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుల బాలకృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం బాగా లేక వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News December 27, 2025

మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?

image

కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్‌గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్‌గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు.

News December 27, 2025

సిరిసిల్ల: ఉపాధి కూలి పెంపు ప్రకటనపై పెరుగుతున్న ఆశలు

image

జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం కింద దినసరి కూలి పెంచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండడం ఉపాధి కూలీలలో ఆశలను పెంచుతోంది. ఏటా 100 పని దినాలను 125 రోజులకు పెంచిన నేపథ్యంలో దినసరి కూలిని రూ.270ల నుంచి రూ.325ల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. కూలి పెంపుపై ఇంకా తుది ప్రకటన వెలువడనప్పటికీ, పెంచే ఆస్కారం కనిపించడం కూలీలలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

News December 27, 2025

భారీ స్కాంలో చిత్తూరు జిల్లా ఫస్ట్.!

image

చిత్తూరు జిల్లాలో నకిలీ GST స్కాంలో రూ.118.70 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొల్లగొట్టారు. వాటి వివరాలు: ☞ లలిత ట్రేడర్స్-రూ.25.43 కోట్లు ☞ RP ఎంటర్ప్రైజెస్-రూ.15.98కోట్లు ☞ తాజ్ ట్రేడర్స్-రూ.13.37 కోట్లు ☞మహాదేవ్ ఎంటర్ప్రైజెస్- రూ.9.54 కోట్లు. మరింత సమాచారం కోసం <<18683267>>క్లిక్<<>> చేయండి.