News March 29, 2025
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: డీఎంహెచ్ఓ

30, అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ వెంకట్ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సహకారంతో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ భవనంలో శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
Similar News
News April 2, 2025
HYD: CM రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ

శ్రీరామనవమి శోభాయాత్రకు ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని BJP ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 15 ఏళ్లుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు శబ్ద నియంత్రణ పేరుతో ఆంక్షలు వేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర మతాలకు ఇలా ఆంక్షలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. యాత్రను నిర్బంధం లేకుండా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు.
News April 1, 2025
కేసీఆర్తో వరంగల్ బీఆర్ఎస్ నేతల భేటీ

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వారంతా కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తామని వారంతా ముక్తకంఠంతో పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు.
News April 1, 2025
HYD: కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన

మీర్పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడిషరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.