News March 25, 2024

ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకే: మీనాక్షి నాయుడు

image

పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే సీటు BJPకి కేటాయిస్తున్నారనే మీడియాలో ప్రచారం జరగడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మీనాక్షినాయుడు నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దయచేసి మీడియాలో వచ్చిన కథనాలను నమ్మొద్దని.. ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదని తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 17, 2025

కర్నూలు : ‘వారి కోసం.. ఒక్క క్షణం ఆలోచించండి’

image

మరి కాసేపట్లో కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. అయితే పరీక్షా కేంద్రాల వద్దకు టెన్షన్ టెన్షన్ గా చేరుకుంటున్న విద్యార్థుల కోసం ఒకసారి ఆలోచిద్దాం. వీలైతే వారిని పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చి మన వంతు సాయం చేద్దాం.

News March 17, 2025

కర్నూలు: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

image

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆదివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని మెలిగుట్ట దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శరీరం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ 9121101152కి సంప్రదించాలని సూచించారు.

News March 17, 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలి: కర్నూలు కలెక్టర్

image

తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి ఉండాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రంలో చిల్డ్రన్స్ పార్క్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.

error: Content is protected !!