News March 29, 2025
భరత్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మహిళ హత్య కేసును ఛేదించారు

ఈనెల 26న జరిగిన భరత్ నగర్ ఫ్లైఓవర్ కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జనగామ చెందిన కనకరాజు అనే వ్యక్తి ఆ మహిళతో శారీరకంగా కలిసిన తర్వాత కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. హత్య చేసిన వ్యక్తి పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.
Similar News
News April 2, 2025
రాచకొండ కమిషనరేట్లో ఏప్రిల్ 4న బహిరంగ వేలం..!

అంబర్పేటలోని CAR పరేడ్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్స్ వద్ద కాలం చెల్లిన, పనికిరాని వాహనాల బహిరంగ వేలం రాచకొండ కమిషనరేట్ నిర్వహించనుంది. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ట్రాఫిక్ సామగ్రి, IT & కమ్యూనికేషన్స్ బ్యాటరీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, ప్రింటర్లు ఏప్రిల్ 4 ఉదయం 10:30 గంటలకు విక్రయించనున్నారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు, ముందుగా అనుమతి తీసుకుని వస్తువులను పరిశీలించవచ్చన్నారు.
News April 2, 2025
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

IPL ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్స్టాగ్రామ్లో 18M ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ టీమ్గా నిలిచింది. ఇప్పటికే ఫాలోయింగ్లో CSK(17.8M)ను దాటేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 18వ సీజన్, విరాట్ జెర్సీ నం.18 కావడం, IG ఫాలోవర్లు 18Mకు చేరడం చూస్తుంటే కప్ తమదేనని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సీజన్లో RCB టేబుల్ టాపర్గా కొనసాగుతోంది.
News April 2, 2025
బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.