News March 29, 2025

MBNR: నేషనల్ ఖో-ఖో జట్టుకు ఎంపిక

image

మహబూబ్ నగర్ జిల్లా నుంచి 57వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్-2024-25కు మంగలి శ్రీలక్ష్మి, కే.శ్వేత, ఎరుకలి శశిరేఖ ఎంపికయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రం ఖోఖో మహిళా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒడిశాలో ఈనెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీంతో ఎంపికైన క్రీడాకారులకు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లా నేతలు, తదితరులు అభినందించారు. CONGRATULATIONS❤

Similar News

News September 11, 2025

జడ్చర్ల: ఎరువు విక్రయ కేంద్రాల తనిఖీ

image

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News September 11, 2025

MBNR: భారీ వర్షాలు.. SP కీలక ఆదేశాలు

image

వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు వచ్చే మూడు రోజులు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా ఉన్నందున గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు.

News September 11, 2025

MBNR: యువతకు GOOD NEWS.. అప్లై చేసుకోండి

image

యువత వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ -2025లో పాల్గొనుటకు ఈనెల 30లోపు రిజిస్టేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. కంప్యూటర్ ట్రేడ్స్‌కు 16-24లోపు ఉండాలని, ఈ పోటీలో జిల్లా, రాష్ట్ర, నేషనల్, ఇంటర్ నేషనల్ స్థాయిలో ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులు దాదాపు 56కి పైగా నైపుణ్యాలలో పోటి పడొచ్చన్నారు. Web:https://www.skillindiadigital.gov.in.