News March 29, 2025

MDCL: స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుక

image

కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుకగా, బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి ఒక్క రూపాయి వడ్డీని తిరిగి చెల్లించే నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను సంబంధిత బ్యాంకుల ఖాతాల్లో జమ చేయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రూ.5.66 కోట్లు చెల్లించి, జిల్లాలోని 3910 స్వయం సహాయక సంఘాలకు గత సంవత్సరం చెల్లించిన వన్ రూపీ వడ్డీ తిరిగి చెల్లించడం జరిగిందని అధికారులు తెలిపారు.

Similar News

News November 16, 2025

అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.

News November 16, 2025

సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 58.42 లక్షల రికవరీ

image

సంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్ అదాలతో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 58.42 లక్షలు బాధితులకు అందించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొత్తం 1,134 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్నారు.

News November 16, 2025

కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

image

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.