News March 29, 2025

భర్త చేతిలో భార్య దారుణ హత్య

image

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనీపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News April 2, 2025

కొండగట్టు : అంజన్న సన్నిధిలో దీక్షలు స్వీకరణ

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు పలు జిల్లాలకు చెందిన భక్తులు హనుమాన్ మాల స్వీకరించారు . స్థానిక ఆలయ అర్చకులు పవన్, అనిల్, శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో 11 రోజులు పాటు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ రోజు మాల వేసుకున్న స్వాములు చిన్న జయంతికి విరమణ చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం దీక్ష స్వాములు అంజన్నను దర్శించుకున్నారు .

News April 2, 2025

ఓడరేవు సొసైటీ సీఈఓని ట్రాప్ చేసి దోచేసిన మహిళ

image

అమలాపురానికి చెందిన ఓడరేవు సొసైటీ సీఈవోని కుమారి అనే మహిళ నిలువుదోపిడీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 17న మద్యం తాగి పానీపూరి బండి దగ్గరకు వచ్చిన సొసైటీ సీఈవోని కాకినాడకు చెందిన మహిళ ట్రాప్ చేసింది. ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తు బిల్లలు, గడ్డి మందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్లాక రూ.లక్ష నగదు, ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరు అరెస్టయ్యారు.

News April 2, 2025

వనపర్తి: ఇది పెద్దగూడెం రామాలయం చరిత్ర…!

image

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో కోదండ రామస్వామి ఆలయాన్ని 1791లో నాటి వనపర్తి సంస్థానాధీశులు రాణి శంకరమ్మ తన భర్త రామేశ్వరరావు జ్ఞాపకార్థంగా నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. మూల విరాట్ విగ్రహాలను తమిళనాడు మఠాధిపతులు ప్రతిష్ఠించారని పెద్దగూడెం కోదండ రామాలయం ప్రధాన అర్చకులు రమణయ్య తెలిపారు.

error: Content is protected !!