News March 29, 2025

నేడు బ్యాంకుల్లో పింఛన్ డబ్బులు జమ

image

AP: బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్న నేపథ్యంలో పింఛన్ల డబ్బులను ప్రభుత్వం ఇవాళే బ్యాంకుల్లో జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా నేడే బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ 1న సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేస్తారు. కాగా ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.

Similar News

News November 13, 2025

‘ఓం’ అని పలికితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

image

ఓంకార నాదంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ పవిత్ర శబ్దం, విశ్వ నాదం(432 Hz)తో ఏకమై కొత్త శక్తిని సృష్టిస్తుంది. దీనివల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై, అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే నిత్యం ఓంకార పఠనం చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.
☛ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 13, 2025

124 పోస్టులకు SAIL నోటిఫికేషన్

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>) 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in

News November 13, 2025

డెయిరీ ఫామ్ నిర్వహణకు పాడి పశువులను ఎప్పుడు కొనాలి?

image

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న లాంటి పశుగ్రాసాలను.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ లాంటి చిక్కుడు జాతి పశుగ్రాసాలను సాగుచేయాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలని సలహా ఇస్తున్నారు.