News March 29, 2025

భీమవరం : బాలికపై తండ్రి వరుసయ్యే వ్యక్తి లైంగిక వేధింపులు

image

కన్నతండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తే బాలికపై కన్నేసిన ఘటన భీమవరంలో జరిగింది. 2 టౌన్ SI ఫాజిల్ రెహ్మాన్ కథనం..భర్తతో విడిపోయిన మహిళ ఇద్దరి కుమార్తెలతో.. వచ్చేసి పదేళ్ల నుంచి సత్యవతి నగర్లో కే.గణేశ్‌తో సహజీవనం చేస్తోంది. అతనితోనూ ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆమె ఇంట్లో లేనప్పుడు మొదటి భర్తకు జన్మించిన బాలికను లైంగికంగా వేధించేవాడు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News April 2, 2025

భీమవరంలో వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

భీమవరం పట్టణంలోని ఈ నెల 28న అమ్మిరాజు తోటలో దొంగతనం కేసులో పట్టణానికి చెందిన నిందితుడు విట్టర్ పాల్‌ను సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. డీఎస్పీ జై సూర్య తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు మంగతాయారు ఇంటికి వెళ్లి దగ్గర బంధువునని చెప్పి 3 గంటల పాటు విట్టర్ కబుర్లు చెప్పాడు. ఆమె భర్త బయటకు వెళ్ళగానే వృద్ధురాలిపై బ్లేడుతో దాడి చేసి బంగారాన్ని దొంగిలించాడు.

News April 2, 2025

హత్య జరిగిన 36 గంటల్లో నిందితుడు అరెస్ట్: సీఐ

image

కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

News April 2, 2025

ప.గో: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించాలి..జేసీ

image

రబీ ధాన్యం కొనుగోళ్లకు వేగవంతమైన చర్యలు ప్రారంభించాలని, కొనుగోళ్లలో రైతుకు లాభం చేకూర్చేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ధాన్యం సేకరణ కమిటీ అధికారులతో సమీక్షించారు. ఈ రబీ సీజనులో కనీస మద్దతు ధర ప్రతి క్వింటా ధాన్యంకు సాధారణ రకం రూ.2,300 చొప్పున, గ్రేడ్-ఏ రకానికి రూ.2,320 గా నిర్ణయించడం జరిగిందన్నారు.

error: Content is protected !!