News March 29, 2025

79వేల ఎస్సీ కుటుంబాలకు సోలార్ ప్యానల్స్: కలెక్టర్

image

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో ఉన్న 79 వేల షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు ఏపీ ట్రాన్స్కో బ్యాంకర్ల సమన్వయంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ట్రాన్స్కో అధికారులు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఇప్పటి వరకు సూర్య ఘర్ పథకానికి అర్హులైన వారి జాబితాపై సమీక్షలు నిర్వహించారు. మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలన్నారు

Similar News

News April 2, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో అధికారుల ఎలర్ట్

image

నరసరావుపేటలో పచ్చి చికెన్‌ను తిని బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడి బాలిక మృతి చెందడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాలిక ఇంటితో పాటు సమీప ప్రాంతాలలో నివసించే వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో తొలి బర్డ్ ఫ్లూ మృతి కేసు కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చికెన్ షాపుల్లో సైతం పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

News April 2, 2025

NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

image

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2025

జిన్నారం: వాహనం తనిఖీ చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టిన కారు

image

జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగలక్ష్మి తన సిబ్బందితో నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న నాగలక్ష్మిని మద్యం మత్తులో కారు ఢీకొని వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించడంతో కారును కొద్దిపాటి దూరంలో వదిలి పారిపోయారు. స్వల్ప గాయాలతో ఎస్ఐ నాగలక్ష్మి బయటపడ్డారు.

error: Content is protected !!