News March 29, 2025
మంచిర్యాల: అర్ధరాత్రి దొంగల బీభత్సం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే దుండగులు బంగారం, వెండీ వస్తువులతో ఉడాయించారు. స్థానికుల వివరాలు.. BRS నాయకుడి ఇంటితో పాటు మరొకరి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి తలుపులు తెరిచి 30తు. బంగారు వస్తువులు, కిలోన్నర వెండి ఎత్తుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News April 2, 2025
తుంగతుర్తి మండల వాసికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

తుంగతుర్తి(M) కరివిరాలకొత్తగూడెంకి చెందిన కాసర్ల మహేశ్కి కోర్టు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ చైతన్యపురి PS పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన, అత్యాచారం, పోక్సో కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం అతడిని దోషిగా నిర్ధారించారు. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, డి.రఘు తెలిపారు.
News April 2, 2025
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News April 2, 2025
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.