News March 29, 2025
VJA: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

అయ్యప్ప నగర్లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో కృష్ణా జిల్లా అవినిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్షలాది లభ్యమయ్యాయి. మరిన్ని బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News July 4, 2025
ఖమ్మం: చిన్నారి నృత్యం.. గిన్నిస్ బుక్ రికార్డులో చోటు.!

వేంసూరు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి-మంజీర దంపతుల పదేళ్ల కూతురు చూర్ణిక కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటింది. HYDలో జరిగిన పోటీలో 4,219 మంది నృత్యకారులతో కలిసి చూర్ణిక పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. ప్రతిభ చాటిన ఆమెకు నిర్వాహకులు శ్రీ లలిత, వసుంధర గోవిందరాజ్, శ్వేత సర్టిఫికెట్ అందజేశారు. చిన్నారికి మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.
News July 4, 2025
NGKL: సీఎం రేవంత్ రెడ్డి జూరాలను సందర్శించాలి: జాన్ వెస్లీ

జూరాల ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జూరాల ప్రాజెక్టును సందర్శించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టును స్థానిక సీపీఎం నాయకులతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు గేట్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.
News July 4, 2025
నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్లో బంగారం కొని భారత్కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.