News March 29, 2025
జగిత్యాల.. ACCIDENT.. వ్యక్తి మృతి

JGTL-KNR ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 11గంటలకు కొండగట్టు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మధుర నరేశ్ వాహనం అదుపుతప్పి పడగా.. అతన్ని కాపాడేందుకు వచ్చిన మల్యాల(M) గొర్రెగుండానికి చెందిన వంశీధర్ రావును అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీధర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్యాల ఎస్ఐ తెలిపారు.
Similar News
News July 4, 2025
సిద్ధార్థ్ ‘3 BHK’ మూవీ రివ్యూ&రేటింగ్

తన తండ్రి సొంతిల్లు నిర్మించాలనే కలను హీరో నెరవేర్చాడా లేదా అన్నదానిపై ‘3 BHK’ మూవీని తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. సిద్ధార్థ్, శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ ఫరవాలేదనిపించాయి. డైరెక్టర్ శ్రీ గణేశ్ స్క్రీన్ ప్లే స్లోగా సాగింది. సాంగ్స్ అలరించలేదు. కథను ముందే ఊహించవచ్చు. కొన్ని సీన్లు పదేపదే వస్తూ సీరియల్ను తలపిస్తాయి. రేటింగ్: 2.25/5
News July 4, 2025
సిరిసిల్ల: ‘బడ్జెట్ కూర్పులో ఘనపాటి’

బడ్జెట్ కూర్పులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఘనపాటి అని బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు.
News July 4, 2025
గద్వాల జిల్లా పోలీసులకు 12 పతకాలు: ఎస్పీ

జోగులాంబ జోనల్-7 స్థాయి పరిధిలో రెండు రోజులు నాగర్ కర్నూల్లో నిర్వహించిన “పోలీస్ డ్యూటీ మీట్”లో గద్వాల జిల్లా పోలీస్ అధికారులు ప్రతిభ కనబరిచి 12 పతకాలు సాధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 3 బంగారు, 6 రజత, 3 కాంస్య పతకాలు ఉన్నాయని చెప్పారు. వాటిని జిల్లా పోలీసు అధికారులు జోగులాంబ జోన్ -7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.