News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. UPDATE

image

అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.

Similar News

News September 16, 2025

GDK: ‘సెలవులకు ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి’

image

దసరా సెలవులకు ఊర్లకు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి DCP P.కరుణాకర్‌ సూచించారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వారికి సమాచారం ఇస్తే పెట్రోలింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఊర్లకు వెళ్తే విలువైన వస్తువులను ఇండ్లలో వదిలి వెళ్లవద్దని, బ్యాంక్‌ లాకర్‌లో భద్ర పరుచుకోవాలని సూచించారు. ఇంటిని గమనిస్తూ ఉండాలని చుట్టూ పక్కల వారికి తెలిపి వెళ్లాలని సూచించారు.

News September 16, 2025

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

image

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.

News September 16, 2025

పెద్దపల్లి: ‘మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి’

image

PDPLలో సెప్టెంబర్17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ-సశక్తి పరివార్ అభియాన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతిరోజు ప్రత్యేక వైద్య క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. బాలికల గురుకులాల్లో స్క్రీనింగ్ టెస్టులు, గర్భిణీలకు 100% ANC చెకప్, పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.