News March 29, 2025
MBNR: ‘కవులకు పుట్టినిల్లు.. పాలమూరు’

పాలమూరు జిల్లా కవులకు పుట్టినిల్లని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఓ కవి సమ్మేళనంలో.. తెలంగాణలో కవులే లేరని ఆంధ్ర కవి అనగా.. సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోలకొండ కవుల సంచిక గ్రంథాన్ని రాసి చరిత్ర సృష్టించారన్నారు. ముకురాల రామారెడ్డి, రుక్ముద్దీన్, రాళ్లపల్లి అనంత శర్మ, పాకాల యశోదా రెడ్డి, కపిలవాయి లింగమూర్తి కవులు పాలమూరు ఖ్యాతిని పెంచారన్నారు.
Similar News
News July 5, 2025
బాలసదనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో రూ.1.34 కోట్లతో నిర్మిస్తోన్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News July 5, 2025
గుంటూరు: కానిస్టేబుల్ కుటుంబానికి సహాయం

గుంటూరు జిల్లా 2012 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు రూ.1.35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు తండ్రికి రూ.35 వేలు, సతీమణికి రూ.లక్ష అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ క్రాంతి కుమార్ 2012 బ్యాచ్ సేవా, ఐక్యమత్యాన్ని ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ శాఖ తరఫున కుటుంబానికి అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News July 5, 2025
నిర్మల్: మంత్రి ఆదేశాల అమలుపై అధికారులతో సమీక్ష

మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రతివారం నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో శానిటేషన్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, మొక్కల సంరక్షణకు గ్రామస్థాయిలో బాధ్యతలు అప్పగించాలన్నారు. పరిశుభ్రత, మంచి నీటి వినియోగం, పచ్చదనం పెంపుతో ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని పేర్కొన్నారు.