News March 29, 2025

వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

image

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.

Similar News

News November 3, 2025

జిల్లాలో సాధారణంగానే చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత సాధారణంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో గొల్లపల్లిలో 22.6℃, మన్నెగూడెం 22.8, పెగడపల్లె 22.9, కోరుట్ల 23.0, కథలాపూర్, గోవిందారం 23.1, రాఘవపేట, జగ్గసాగర్, తిరుమలాపూర్ 23.2, రాయికల్, ఐలాపూర్, గోదూరు 23.3, కొల్వాయి, పూడూర్, పొలాస 23.4, బుద్దేశ్‌పల్లి, మేడిపల్లె, మల్యాల, జగిత్యాల 23.5, మల్లాపూర్లో 23.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగానే ఉంది.

News November 3, 2025

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: ఎస్పీ

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధించామని చెప్పారు.

News November 3, 2025

వనపర్తి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి

image

విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంలో TGSPDCL ఎస్‌ఈ రాజశేఖరమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వినియోగదారుల నుంచి 18 ఫిర్యాదులను స్వీకరించారు. పాడైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ మీటర్ బిల్లులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. డీఈ. శ్రీనివాస్, వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.